విశాఖ చుట్టుపక్కల రూ.వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ముందస్తుగానే రైతులను ప్రలోభపెట్టారు. మొత్తం ఎసైన్డ్ భూములను రాయించుకుని జీవో తీసుకొచ్చారు. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫ్రీహోల్డ్ పట్టాలు రైతుల దగ్గరే ఉన్నాయా? వైసీపీ నేతల దగ్గర ఉన్నాయా? అని సీఎస్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు' అని మూర్తియాదవ్ తెలిపారు.