ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా మరోసారి లీకైంది. గత ఆరునెలల్లో డేటా హ్యాక్ అవ్వడం రెండోసారి. ఇందులో సిమ్కార్డ్ వివరాలు, అంతర్జాతీయ మొబైల్ చందాదారుల గుర్తింపు, హోమ్ లొకేషన్ వంటి సమాచారం ఉన్నట్లు అథెంటియన్ టెక్నాలజీస్ పేర్కొంది. బీఎస్ఎన్ఎల్కు చెందిన 278 జీబీ డేటా ఉందంటూ కిబర్ఫాంటోమ్ అనే వ్యక్తి 5000 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు తన నివేదికలో పేర్కొంది.