కర్ణాటకలోని తుమకూరు సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ముందు వెళుతున్న కారును తప్పించబోయిన బస్సు రెయిలింగ్ను ఢీకొంది. అలాగే, మరో ఫ్లైఓవర్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.