దేశంలో నీట్, యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీకేజ్ దుమారం చెలరేగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్ కె. రాధాకృష్ణన్ నేతృత్వం వహించనున్నట్లు తెలిపింది. ఇందులో డా. రణ్దీప్ గులేరియా లాంటి పలువురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.