సింహాచలంలో దర్శనం నిలిపివేత

సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈనెల 11న దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సింహాచలం గ్రామ దేవతలైన ఉమామహేశ్వరి, పాదాలమ్మ, బంగారమ్మ పండుగలు మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో మ. 2.30 వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, తిరిగి బుధవారం ఉదయం 7 గంటలకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్