యూపీలోని ఘజియాబాద్ లో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రసాయనాలు నింపిన ట్యాంకర్ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కెమికల్ లీకేజీ కారణంగా మంటల్లో చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.