సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా ఇవాళ కొడంగల్కు వెళ్లనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన కొడంగల్లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొడంగల్కు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే సతీసమేతంగా సీఎం దంపతులు కొడంగల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.