పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహిళలతో కలిసి కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎంసీ నేతల లైంగిక దాడుల ఆరోపణలతో రగులుతున్న సందేశ్ఖాలీ దీవికి చెందిన మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీతో పాటు ప్రధాని మోదీపై మమతా బెనర్జీ పలు విమర్శలు చేశారు. మణిపూర్, హత్రాస్లో అత్యాచారాలు జరిగినప్పుడు మోదీ ఎక్కడున్నారు. బిల్కిస్బానోను మీరు మరిచిపోయారా? అని ప్రశ్నించారు.