కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్లో వీడ్కోలు విందు చేసుకుంటున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ మెట్లు ఎక్కనివ్వని ఆయన ఇప్పుడు బంతి భోజనాలు చేస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపులపై బాధపడుతున్న కేటీఆర్ ట్విట్టర్లో తప్ప ప్రజలకు ఉపయోగపడే దగ్గర కనిపించరని అన్నారు.