పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. 42 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో టీఎంసీ ఇప్పటికే 32 స్థానాల్లో లీడింగ్లో ఉన్నది. బీజేపీ 9, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. బహరంపూర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఓటమి బాటలో ఉన్నారు. ఆ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ లీడింగ్లో ఉన్నారు.