ముందంజలో ఖలిస్థానీ నేత అమృత్‌పాల్‌ సింగ్‌

82చూసినవారు
ముందంజలో ఖలిస్థానీ నేత అమృత్‌పాల్‌ సింగ్‌
లోక్ సభ ఎన్నికల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అతివాద సంస్థ అధిపతి అమృత్‌పాల్‌ సింగ్‌ ముందంజలో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైల్లో ఉన్న ఆయన పంజాబ్‌ లోని ఖడూర్‌ సాహిబ్‌ నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం అతను కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్బీర్‌ సింగ్‌ జీరాపై 45,424 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమృత్‌సర్‌ జిల్లా అజ్‌నాలా పోలీసులపై దాడి కేసులో అమృత్‌పాల్‌ పేరు దేశంలో మార్మోగింది.

సంబంధిత పోస్ట్