ఢిల్లీలో నీటి సమస్యపై దీక్ష చేపట్టి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ మంత్రి అతిషి డిశ్చార్జ్ అయ్యారు. 2 రోజులపాటు చికిత్స తీసుకున్న ఆమె ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. మంత్రిని ఆసుపత్రి నుంచి ఉదయం 10:30 గంటలకు డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. కాగా, ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ ఈనెల 21న అతిషి నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.