‘ఢిల్లీ ఛలో’ నిరసన కార్యక్రమం కోసం రైతులు అనుసరిస్తున్న విధానంపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. సైన్యం తరహాలో దేశ రాజధానిలోకి వెళ్లాలని భావించడం సరైన చర్య కాదని హితవు పలికారు. దేశరాజధాని ఢిల్లీకి వెళ్లాలంటే రైళ్లు, బస్సుల్లో వెళ్లవచ్చని, కానీ ట్రాక్టర్లు, ట్రాలీల్లో ఏడాదికి సరిపడా ఆహార పదార్థాలతో రావడం వెనుక వారి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.