తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. మనీలాండరింగ్ చట్టం కింద ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ పథకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందన్న ఏసీబీ వెల్లడించింది. కేసులో 10 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపింది.