పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మధుసూదన్ ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు ముగిశాయి. దాదాపు 11 గంటల పాటు మధుసూదన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మధుని అధికారులు అరెస్ట్ చేసి జీఎంఆర్ ఫంక్షన్ హాల్లోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంకా మహిపాల్ రెడ్డి నివాసంలో మాత్రం సోదాలు కొనసాగుతున్నాయి. లగ్డారం గనుల వ్యవహారంలో కేసు నమోదు కావడంతో తనిఖీలు చేసినట్లు సమాచారం.