బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు 10 మంది రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెల్సీ నివాసానికి సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్లో దావత్ పేరుతో కలిసినట్లు సమాచారం. ఈ అసెంబ్లీ సెషన్కు ముందే అధికార పార్టీలో చేరాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్కు త్వరలోనే మరో దెబ్బ తగలనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.