మెదక్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ ఎంపీ రఘునందన్ రావు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మెనేజర్ అరుణ్ కుమార్ జైన్కు వినతి పత్రం అందజేశారు. పటాన్చెరు నుంచి మెదక్, అక్కన్న పేట వరకు, సిద్దిపేట నుంచి పెద్దపల్లి వరకు రైల్వేలైన్లు పొడిగించాలని కోరారు. మెదక్, సిద్దిపేట నుంచి తిరుపతికి రైలు సర్వీస్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయాలపై జీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.