ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇవాళ తాజాగా మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సెమ్రా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగగా.. 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.