అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాతనైనా కేసీఆర్లో మార్పువస్తుందని ఆశించమని సీఎం రేవంత్ అన్నారు. రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని ఆశించామని కానీ.. ఆయనలో మార్పు రాలేదు సరికదా.. ఈ ప్రభుత్వం పడిపోతుందంటున్నారని ఘాటుగా స్పందించారు. హనుమకొండ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ‘తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను మోదీ గుజరాత్కు తరలించారు. ఆయన గుజరాత్కు మాత్రమే ప్రధానా? దేశం మొత్తానికా?’ అని ప్రశ్నించారు.