రాంచీ టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. దూకుడుగా ఆడుతున్న జాక్ క్రాలే (60)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. 28.1 ఓవర్ వద్ద బ్యాక్ఫూట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (4) కూడా 32.3 వద్ద కుల్దీప్ బౌలింగ్లోనే బౌల్డయ్యాడు. దీంతో భారత్కు ఐదో వికెట్ దక్కింది. ఇంగ్లాండ్ స్కోరు 120/5.