తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభంకానుంది. ఎన్నికల కోడ్ ముగియనుండటంతో శుక్రవారం నుంచి అధికారులు సమస్యలతో వచ్చిన వారి వినతి పత్రాలను స్వీకరిస్తారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి ఎప్పటి లాగే కొనసాగనుంది.