వడ్లు తడుస్తున్నాయని కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోలు చేయాలని భువనగిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం వారు తడిసిన ధాన్యం బస్తాలతో వచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు పోలీసులు రాగానే.. రైతులు వారి కాళ్లు మొక్కుతూ తమ బాధలు తీర్చాలని వేడుకున్నారు.