నదిలో మునిగిపోతున్న తండ్రిని రక్షించబోయి.. కూతురు మృతి

నదిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడబోయి కూతురు మరణించింది. గుండెలను పిండివేసే ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లాలో జరిగింది. మంగపేట మండలం కమలాపురంకు చెందిన నిఖిత సమీపంలోని గోదావరి నది వద్దకు తండ్రితో వెళ్లింది. తండ్రి స్నానం చేసేందుకు గోదావరిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక మునిగిపోతుండగా ఒడ్డున ఉన్న కుమార్తె చేయి అందించి బయటకు లాగింది. ఇదే క్రమంలో బండమీద నుంచి ఆమె కాలుజారి గోదావరిలో పడి మునిగి మృతి చెందింది.

సంబంధిత పోస్ట్