బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహీల్కు హైకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్పై 2వారాల పాటు కోర్టు స్టే విధిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో రాహీల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల రహీల్ దుబాయ్ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరు పరచగా.. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు.