సిద్ధిపేట జిల్లాలోని మగ్దుంపూర్ పాఠశాలలో చదువుతున్న బాలికలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఉచిత ప్రయాణ పథకం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అమల్లో ఉందని, గత ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ నేతలు తమ ఖాతాలో వేసుకోవడం శోచనీయమని హరీష్ రావు ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పథకం ద్వారానే బాలికలు పాఠశాలలకు వెళ్తున్నట్టు సీఎం గొప్పలు చెప్పడం హాస్యాస్పదమన్నారు.