తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న కుమారస్వామి

60చూసినవారు
తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న కుమారస్వామి
కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ పార్టీ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి.. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి తన తల్లిదండ్రులను కలిశారు. తన తల్లిదండ్రులు చెన్నమ్మ, దేవేగౌడ దంపతులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమితో కలిసిన కుమారస్వామి మాండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్