కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి.. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి తన తల్లిదండ్రులను కలిశారు. తన తల్లిదండ్రులు చెన్నమ్మ, దేవేగౌడ దంపతులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమితో కలిసిన కుమారస్వామి మాండ్య లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.