గుజరాత్లోని అహ్మదాబాద్లో పౌడర్ కోటింగ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదస్థలిని పరిశీలించారు. ఓవెన్లో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని నికోల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఎస్ఎస్ గాధవి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.