2024 ఫిబ్రవరి ముగింపు నాటికి జియో 42.67 కోట్ల వినియోగదారులతో 40.18 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఎయిర్టెల్ 38.26 కోట్లతో 32.97 శాతం వాటాను, విఐ 19.38 కోట్ల వినియోగదారులతో 18.93 శాతం వాటాలను కలిగి ఉంది. 2024 మార్చి ముగింపు నాటికి జియోకు ప్రతీ వినియోగదారుడి నుంచి రాబడి (ఎఆర్పియు) రూ.181.7గా ఉంది. ఎయిర్టెల్ ఎఆర్పియు రూ.209గా ఉంది. తాజా పెంపుతో ఆ కంపెనీలకు మరింత రాబడి పెరగనుంది.