లోక్ సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైన సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓం బిర్లాకు అభినందనలు తెలిపిన రాహుల్ గాంధీ వెంటనే తన పక్కన ఉన్న ప్రధాని మోదీకి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. అనంతరం స్పీకర్ను తన చైర్ వరకు తీసుకెళ్లారు.