గడిచిన కొద్దికాలంగా కేసీఆర్కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ను చావుదెబ్బ కొట్టాయి. దానితో పార్టీ భవిష్యత్తు ఆగమ్యగోచరమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ తాజాగా కోర్టు స్పందించిన తీరుతో మరింత ఇబ్బందులో పడబోతున్నారు. పదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలకు తోడు ట్యాపింగ్ విషయంపై రేవంత్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే కేసీఆర్ ఇబ్బందుల్లో పడటం ఖాయమంటున్నారు.