భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులతో పాటు సామాన్యులు కూడా హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, ట్రాన్స్జెండర్లు, నూతన పార్లమెంటు భవన నిర్మాణ శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైళ్ల వంటి కీలక ప్రాజెక్టుల్లో పని చేసిన వారికి అవకాశం కల్పించారు.