తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. ఉదయం 10 గంటల వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులను ముందుగానే చేరుకున్నారు. సిద్దిపేట డిగ్రీ కాలేజీ సెంటర్ వద్దకు నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన పది మంది అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. దీంతో వారు నిరాశగా అక్కడి నుంచి వెనుతిరిగారు.