ఓటీటీలోకి వచ్చేస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'

59చూసినవారు
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'
విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 14న నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో సినిమా అందుబాటులో ఉండనుంది. కృష్ణచైతన్య తెరకెక్కించిన ఈ మూవీ మే 31న విడుదలై 10 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్