భారత్ తొలి ప్రపంచకప్ గెలిచి నేటికి 41 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘41 ఏళ్ల క్రితం జరిగినప్పటికీ ట్రోఫీ గెలుపొందిన రోజు రాత్రి నాకు ఇంకా గుర్తుంది. 1983 WCను ఇండియా గెలిచినప్పుడు నా ఇంటి పరిసరాల్లోని ప్రజలు నృత్యాలు చేస్తూ, టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు’ అని ట్వీట్ చేశారు.