ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నీట్ స్కాం వ్యవహారంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పరీక్ష నిర్వహణలో అక్రమాలు, మోసాలు జరిగాయని ఆరోపించారు. ఈ పరీక్షలో గ్రేస్ మార్కుల సమస్య ఒక్కటే కాదన్న ఆయన.. ప్రశ్నపత్రం లీక్ అయిందని, అవినీతి జరిగిందంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. నీట్ పరీక్ష వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.