పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న, BRS నేత నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో గెలిచిన వీరిద్దరితో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. మల్లన్న ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.