హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టురట్టైంది. హైదరాబాద్ నుంచి ఇరాన్ వయా కేరళ ఈ దంద నడుస్తోంది. పేద యువకులకు డబ్బు ఆశ చూపి 40 మంది కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేశారు. అయితే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు మృతి చెందడంతో విషయం బయటపడింది. కేరళలో వెలుగు చూసిన ఈ భాగోతానికి ముఠా మాస్టర్ హైదరాబాద్కు చెందిన వైద్యుడుగా గుర్తించారు పోలీసులు. కేరళతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ అవయవ రవాణా రాకెట్ను పోలీసులు ఛేదించారు.