భూమిలేని పేదలకు భూమి ఇవ్వాలి

భూమిలేని పేదలకు భూమి ఇవ్వాలని భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు కోరారు. బూర్గంపాడు మండలం సారపాకలోని చంద్ర పుల్లారెడ్డి నగర్ లో న్యూడెమోక్రసీ నాయకులు ముత్యాల సత్యనారాయణ అధ్యక్షతన గురువారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్యాల సత్యనారాయణ, జక్కుల రాంబాబు, ఉమ, వైఎస్. రెడ్డి, రామకృష్ణ, అలివేలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్