రేపు మద్యం షాపులు బంద్

రేపు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లను బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఈ బంద్ అమలుకానుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్