బీజేపీ ప్రభుత్వ అంశాలు మందిర్, మసీదు, హిందూ, పాకిస్తాన్ మాత్రమేనని ఫైజాబాద్ (అయోధ్య) నుంచి గెలుపొందిన ఎస్పీ అభ్యర్ధి అవధేష్ ప్రసాద్ అన్నారు. మన దేశం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి కాషాయ పాలకులకు పట్టదని చెప్పారు. అవధేష్ ప్రసాద్ గురువారం లక్నోలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.