ఛత్తీస్గఢ్లోని టేకులగూడెంలో మరోమారు మావోయిస్టులు చెలరేగిపోయారు. మందుపాతరతో పోలీస్ వాహనాన్ని మావోయిస్టులు పేల్చారు. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మృతి చెందిన జవాన్లను విష్ణు, శైలేంద్రగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.