ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ పరిశ్రమలో కొలువుల కోతపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు ఏఐ టూల్స్తో ఐటీ పరిశ్రమలో సిబ్బంది అవసరాలను 70 శాతం తగ్గించవచ్చని హెచ్సీఎల్ మాజీ సీఈవో వినీత్ నాయర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరిచుకున్నాయి. ఆటోమేషన్తో మాస్ లేఆఫ్స్ తప్పదని ఆయన హెచ్చరించారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ను నియమించుకునే బదులు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచాలన్నారు.