మేనల్లుడు ఆకాష్‌ ను.. వారసుడిగా తిరిగి నియమించిన మాయావతి

ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అతడికి అప్పగించారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది జరిగిన వారాల వ్యవధిలోనే మళ్లీ ఆకాశ్‌కే ఆమె ఆ పదవిని కట్టబెట్టడం ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్