యూజీసీ నెట్ పరీక్షను కేంద్రం రద్దు చేయడంతో మోదీ ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని కాంగ్రెస్ విమర్శించింది. "దేశంలోని పలు ప్రాంతాలలో యూజీసీ-నెట్ పరీక్ష జరిగింది. పేపర్ లీక్ అయిందనే అనుమానంతో నెట్ పరీక్షను రద్దు చేశారు. అంతకుముందు నీట్ పేపర్ లీక్ అయింది. ఇప్పుడు యూజీసీ-నెట్. మోదీ ప్రభుత్వం ‘పేపర్ లీక్ ప్రభుత్వం’గా మారిపోయింది" అని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.