తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ ప్రయాణించనున్న వందే భారత్ రైలును ఆయన సికింద్రాబాద్ స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 'అంతర్జాతీయ ప్రమాణాలతో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రవేశపెట్టాం. దక్షిణమధ్య రైల్వేలో ప్రస్తుతం 3 ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయి. ఇవాళ మరో రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు' అని అన్నారు.