పలు రాష్ట్రాల్లో ఎన్డీయేకు గొప్ప విజయం దక్కిందని ప్రధాని మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘1962 తర్వాత ఏ ప్రభుత్వం కూడా మూడోసారి అధికారంలోకి రాలేదు. సబ్కా వికాస్.. నినాదంతోనే మేం మూడుసార్లు అధికారంలోకి వచ్చాం. ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో గొప్ప గెలుపు సాధించాం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, దిల్లీలో దాదాపు క్లీన్ స్వీప్ చేశాం. దేశంలోని కోట్ల మంది మహిళలు మమ్మల్ని ఆశీర్వదించారు.’’ అని మోదీ చెప్పారు.