భారత్పై పాకిస్థాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నవ భారతంతో గణనీయమైన ముప్పు పొంచి ఉందని ఐరాసకు పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనక భారత్ హస్తం ఉందంటూ ఆ మధ్య బ్రిటన్కు చెందిన ‘ది గార్డియన్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిని ఉద్దేశించి మునీర్ కొద్దిరోజుల క్రితం ఐరాసలో మాట్లాడారు. ‘‘నవ భారతంతో ముప్పు పొంచి ఉంది’’ అంటూ నిరాధార ఆరోపణలు చేశారు.