ప్రధాని మోదీ ఇవాళ జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 7 వేల మందితో కలిసి ప్రధాని మోదీ యోగా చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రత చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత మోదీ తొలిసారిగా కశ్మీర్లో పర్యటిస్తున్నారు.