లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులతో ఏడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ రాణా చోటు దక్కించుకున్నారు. ఆమె మహారాష్ట్రలోని అమరావతి నుంచి MP అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాగా, శీను వాసంతి లక్ష్మి, స్ట్రైల్, రణం, మహారథి, యమదొంగ వంటి తెలుగు సినిమాల్లో నవనీత్ నటించారు.