టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కాంబోలో రావాల్సిన 'రాక్షస్' సినిమా రద్దయింది. కానీ, వీరిద్దరి మూవీ ఫ్యూచర్లో ఉంటుందని మైత్రీ మూవీస్ ప్రకటించింది. రాక్షస్కి ఇది సరైన సమయం కాదని, భవిష్యత్లో ఉంటుందని చెప్పింది. ప్రతిభావంతుడైన ప్రశాంత్తో భవిష్యత్తులో సినిమా తీస్తానంటూ రణ్వీర్ వెల్లడించారు. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మూవీ నుంచి రణ్వీర్ సింగ్ వైదొలిగినట్లు తెలుస్తోంది.